PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రియ‌ల్ ఎస్టేట్ నెంబ‌ర్. 1.. ఈయనే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలోని రియ‌ల్ ఎస్టేట్ రంగ‌ సంపన్నుల్లో డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ అగ్రస్థానంలో నిలిచారు. ‘గ్రోహే హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ రిచ్‌ లిస్ట్‌- 2021’లో అగ్రస్థానంలో ఉన్న మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ ప్రమోటర్లు మంగళ్‌ ప్రభాత్‌ (ఎంపీ) లోధా కుటుం బం ఈసారి రెండో స్థానానికి జారుకుంది. మొత్తం 100 మంది స్థిరాస్తి సంపన్నుల వివరాలతో కూడిన ఈ జాబితాలో హైదరాబాద్‌ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. హైద‌రాబాద్ కి చెందిన అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రమోటర్లు సీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్‌ సుబ్రమణ్యం రెడ్డి ఈసారి జాబితాలో వరుసగా 22, 23 స్థానాల్లో నిలిచారు. గడిచిన ఐదేళ్లలో వెంకటేశ్వర రెడ్డి ర్యాంకింగ్‌ 22 స్థానాలు మెరుగుపడగా.. సుబ్రమణ్యం రెడ్డి 21 స్థానాలు ఎగబాకారు.

                                

About Author