NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధిలో11కె.వి స్తంభాల మార్పిడి

1 min read

ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ కు అంతరాయం

వినియోగదారులు సహకరించాలని మనవి

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కె.యం అంబేద్కర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఈనెల 27వ తేదీన ఏలూరు 1వ పట్టణంలో గల కోటదిబ్బ  సబ్ స్టేషన్ పరిదిలో 11కెవి  కెనాల్   ఫీడరులోని  స్తంభాల మార్పిడి పనుల నిమిత్తం  ఉదయం 06:00  గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆపరేషన్ కె.ఎమ్. అంబేద్కర్ శుక్రవారం తెలిపారు.  ఈ సమయంలో కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధి లో గల పెరుగుచెట్టు, అంబికా  థియేటర్, కెనాల్ రోడ్, నవాబ్ పేట, బావిసేట్టివారిపేట, నల్లదిబ్బ మరియు  మునిసిపల్ ఆఫీసు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు.  కావున వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

About Author