PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కాకినాడ అంబేద్కర్ భవన్‎లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి అతికిరాతకంగా రౌడీషీటర్ జగదీష్ ను హత్య చేశారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు గల కారణం గంజాయి వ్యాపారం లావాదేవీలు, పాతకక్షలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

                                      

About Author