NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌భుత్వం పై లోక్ స‌భ‌లో ఆరోప‌ణ‌లు చేసిన ఆర్ఆర్ఆర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో కార్పొరేషన్ల పేరుతో రుణాల సేకరణపై గురువారం లోక్ సభలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు. దీంతో ఆయనను వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు, రఘురామల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను మళ్లిస్తున్నారని రఘురామ ఆరోపించారు. బేవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రుణాలు తీసుకుంటున్నారని, ఏపీ మూలనిధికి నిధులను జమ చేయడం లేదని ఆరోపించారు.

                                          

About Author