మాజీ సీఎం ని మర్యాదపూర్వకంగా కలిసిన శషికళా కృష్ణమోహన్
1 min read
న్యూస్ నేడు ఆలూరు: తాడేపల్లి లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శషికళా కృష్ణమోహన్ , కృష్ణ మోహన్ మరియు ఆలూరు నియోజక వర్గ యువ నాయకులు , కార్యకర్తలు ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ని శాలువాతో సత్కరించి నియోజక వర్గం లో కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను , సమస్యలను జగన్ మోహన్ రెడ్డి కి వివరించటం జరిగినది.
