PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు

1 min read

– అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం -పేదల సేవలోనే సంతృప్తి:యాట ఓబులేసు
పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ జన్మదిన వేడుకలు మండల పరిధిలోని నాగలూటి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాట ఓబులేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనాధాశ్రమంలో ఉన్నవారికి మంచి భోజనం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఆయన వడ్డించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయడమే నాయొక్క ముఖ్య ఉద్దేశమని,పేదలకు సహాయ సహకారాలు అందించడంలోనే నాకు సంతృప్తి నిస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ గా విక్టర్ ప్రసాద్ ను నియమించినందుకు ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటామని అంతేకాకుండా దళితులందరూ కూడా జగనన్న వెంటే నడుస్తామని అన్నారు.మారుమూల ప్రాంతాల్లో నుండి ఎవరైనా సరే కమిషన్ చైర్మన్ గారికి ఫోన్ చేసినా వారి సమస్యకు వెంటనే స్పందించి ఆసమస్యను పరిష్కారం అయ్యే దిశగా చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఎంతో కృషి చేస్తున్నారని యాట ఓబులేసు కొనియాడారు.అట్రాసిటీ బాధితులకు ప్రభుత్యం అందించే పరిహారం అందిస్తూ,వారికి భరోసా కల్పిస్తూ దళిత కుటుంబాలకు అండగా ఉంటున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు ఇమ్మానుయేలు,వైఎస్ఆర్సీపీ నాయకులు సుగాలి శ్రీను, డివిఎంసి మెంబర్ ఎన్.నవీన్ కుమార్,ఎంఆర్పిఎస్ నాయకులు రఘుప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author