PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌చివాల‌యాల‌కు రూ. 3000 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు అత్యంత అవసరమైన ఆర్థిక పరమైన పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,000.80 కోట్లు మంజూరు చేసింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానిక ప్రజలకు అవసరమైన, అత్యధిక ప్రభావం చూపే పనులను మంజూరు చేయడానికి ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం రూ.3,000.80 కోట్లు విడుదల చేసింది.

                                         

About Author