PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్

1 min read


పల్లెవెలుగు వెబ్: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. అయితే సెంచరీ తరువాత మరో ఐదు పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 171 బంతులు ఆడిన శ్రేయాస్ 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన భారత 16వ బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా, 258/4 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ దిగిన టీమిండియా.. ఆదిలోనే రవీంద్ర జడేజాను సౌథీ ఔట్ చేశాడు. అనంతరం వచ్చిన అక్షర పటేల్ కూడా త్వరగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 8 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.

About Author