రామచంద్రా రెడ్డి..పాత్రికేయుడికి సిద్ధార్థ రెడ్డి నివాళులు
1 min read
నివాళులు అర్పించిన జర్నలిస్టులు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా పగిడ్యాల ఆర్ సీ విద్యాసంస్థల అధినేత పుల్యాల నాగిరెడ్డి సోదరుడు పుల్యాల రామచంద్రారెడ్డి మరియు మిడుతూరుకు చెందిన వార్త సీనియర్ పాత్రికేయులు మధు శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే.విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్సిపీ యూత్ వింగ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వారి స్వగృహాలకు వెళ్లి పార్థివ దేహాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి నివాళులు అర్పించారు.మిడుతూరు మండల పాత్రికేయులు మధుకు నందికొట్కూరు (ఏపీడబ్ల్యూజే)జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు నాగేష్, చంద్రశేఖర్,గోవర్ధన్, వెంకటేశ్వర్లు,ప్రభాకర్,రవి తదితర పాత్రికేయులు నివాళులు అర్పించారు. కుటుంబాలకు అండగా ఉంటామని సిద్ధార్థ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మల్లు శివ నాగిరెడ్డి,తలముడిపి సర్పంచ్ స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.