PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాయుగుండం ప్రభావం.. రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే!

1 min read

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్​: ఒడిసా–ఉత్తరాంధ్రా మధ్యలో నెలకొన్న వాయుగుండం గులాబ్​ తుఫాన్​గా మారింది. ఈ ప్రభావం కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో దక్షిణమధ్య రైల్వేశాఖ ఆదివారం పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈసాయంత్రం తుఫాన్​ బలపడి కలింగపట్నం, గోపాలపూర్​ మధ్య పశ్చిమ దిశ నుంచి ఉత్తరం దిశగా తీరాన్నిదాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కురిసే అతిభారీవర్ష సూచనతో రైల్వేశాఖ రైళ్ల రాకపోకలను అర్థాంతంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భువనేశ్వర్​–సికింద్రాబాద్​, భువనేశ్వర్​–తిరుపతి, రాయగడ్​–గుంటూరు, భువనేశ్వర్​–కేఎన్​ఆర్​బెంగుళూరు, భువనేశ్వర్​–యశ్వంత్​పూర్​, పూరి–చెన్నైసెంట్రల్​, సంబల్​పూర్​–హెచ్​ఎన్​నాందేడ్​ రైళ్లతోపాటు మరికొన్నిరైళ్ల రాకపోకలను నిలిపివేసింది.
ఇదిలా ఉండగా… ఆంధ్రప్రదేశ్​లో గులాబ్​ తుఫాన్​ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ దృష్ట్యా అక్కడి పరిస్థితులపై ఏపీ సీఎం జగన్​తో మాట్లాడారు. కేంద్రం నుంచి సహాయసహకారాలు ఉంటాయని సీఎంకు భరోసా ఇచ్చారు.

About Author