PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర గవర్నర్… గిరిజనులతో ముఖాముఖి

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: శుక్రవారం పాణ్యం మండలంలోని నెరవాడ మెట్ట సమీపంలోని ఏపీ గిరిజన బాలికల పాఠశాలలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గారు. గిరిజన బాలికల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ గారికి ఘన స్వాగతం పలికిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర, జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాఖ్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్ధర్, మునిసిపల్ ఛైర్పర్సన్ మాబున్నిషా,ఎస్సి, ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా. శంకర్ నాయక్ తదితరులు, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన స్టాళ్లను సందర్శించిన రాష్ట్ర గవర్నర్. వివిధ పథకాల కింద గిరిజనులకు రు.3.15 కోట్ల అస్సెస్ట్స్ పంపిణీ చేసిన రాష్ట్ర గవర్నర్. అనంతరం గిరిజనుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ కార్యాలయ సెక్రటరీ ఆర్.పి.సిసోడియా, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లాధికారులు, గిరిజనులు.

About Author