NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గిరిజన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేందుకు చర్యలు

1 min read

ధర్తిఆబ జన్ భగిదరి అభియాన్ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలి

మంత్రాలయం, న్యూస్​ నేడు :  గిరిజన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి దేవి, వైకాపా మండల ఇంచార్జీ విశ్వనాథ రెడ్డి రెడ్డి లు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని పరమాన్ దొడ్డి తండా గ్రామంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మేరకు ఎంపిపి గిరిజమ్మ ఆదేశాల మేరకు సర్పంచ్ విజయభారతి అధ్యక్షతన గ్రామంలో జన్ భగిదరి అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతో గ్రామంలో 15రోజుల పాటు జరిగే జన్ భగిదరి అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రతి గిరిజన ప్రజలందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  కేంద్ర ప్రభుత్వం జన్ జాతీయ గౌరవ్ వర్ష్ వేడుకల్లో భాగంగా ధర్తిఆబ జన్ భగిదరి అభియాన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.  వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేసిన విజన్ నుండి మిషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  దేశంలోని 26 రాష్ట్రాలు,4కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 63వేల గ్రామాల యందు 700పైగ గిరిజన తెగలకు సంబంధించిన 5.5 కోట్ల జనాభాకు రూ 80వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అందకుండా ఉన్న ప్రతి ఒక్కరూ 15రోజుల కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదు చేస్తే, అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని వారు తెలిపారు. తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి జీరా గణేష్, అన్ని శాఖల అధికారులు, జడ్పీటీసీ మజ్జిగ గోవిందమ్మ, యంపిటిసి ఈరన్న, నాయకులు సత్యా రెడ్డి, లక్ష్మన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *