NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆగిపోయిన పాల‌సీలు మ‌ళ్లీ మొద‌లుపెట్టొచ్చు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ రంగంలోని జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ రద్దయిన పాలసీల పునరుద్ధరణకు కస్టమర్లకు అవకాశం కల్పించింది. ఇందుకోసం అక్టోబరు 21 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టింది. లేటు ఫీజులో రాయితీతో నాన్‌ యూలిప్‌ హోల్డర్లందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. తొలిసారిగా ప్రీమియం చెల్లించని తేదీ నుంచి ఐదేళ్ల లోపు పాలసీలన్నింటినీ కస్టమర్లు పునరుద్ధరించుకోవచ్చునని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలకు మాత్రం లేటు ఫీజులో నూరు శాతం మినహాయింపు ఇస్తారు.

                                        

About Author