మార్చి 5 నుండి 7 వరకు న్యూడిల్లీలో 24వ ఎడిషన్ వరల్డ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సమ్మిట్
1 min read
పారిస్ అగ్రిమెంట్ కు ఒక దశాబ్దం తర్వాత: క్లైమేట్ చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి
గ్లోబల్ సౌత్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి డబ్ల్యూఎస్డీఎస్ 2025
క్లైమేట్ యాక్షన్ను వేగవంతం చేయడానికి, భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడానికి, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, స్థితిస్థాపకమైన మరియు సుస్థిర భవిష్యత్తు కోసం పరిష్కారాలను అందించడానికి ‘టెరి’ కీలక సమ్మిట్ గ్లోబల్ నాయకులను ఏకం చేస్తోంది.
పల్లెవెలుగు , న్యూఢిల్లీ : వరల్డ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ (WSDS) 24వ ఎడిషన్ 2025 మార్చి 5 నుండి 7 వరకు న్యూడిల్లీలో జరుగుతుంది. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (TERI) ద్వారా ఏటా నిర్వ హించబడే డబ్ల్యూఎస్డిఎస్ సుస్థిర అభివృద్ధి, క్లైమేట్ పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడానికి రూపు దిద్దుకున్న ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమం.
గ్లోబల్ సౌత్లో సుస్థిర అభివృద్ధి, పర్యావరణంపై స్వతంత్రంగా నిర్వహించబడుతున్న ఏకైక గ్లోబల్ సమ్మిట్ ఇది. ‘సుస్థిర అభివృద్ధి, క్లైమేట్ పరిష్కారాలను వేగవంతం చేయడానికి భాగస్వామ్యాలు’ అనే థీమ్పై డబ్ల్యూఎస్డిఎస్ 2025 దృష్టి సారిస్తుంది. ఇది ప్రపంచ క్లైమేట్ సవాళ్లను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGs) పరిష్కరించడానికి భాగస్వామ్య ప్రయత్నాల అవసరాన్ని ప్రముఖంగా చాటిచెబుతుంది. ఎస్డీజీలను చేరుకోవడంలో ఉద్గారాలను తగ్గించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్నందున తీసుకోవాల్సిన చర్యలను ముందుకు నడిపించడానికి భాగస్వామ్యాల శక్తిపై ఈ సమ్మిట్ దృష్టి పెడుతుంది.
ఈ సమ్మిట్ లో భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, క్లైమేట్ ఛేంజెస్ శాఖ గౌరవనీయ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ప్రారంభోపన్యాసం చేస్తారని భావిస్తున్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను, పారిస్ క్లైమేట్ ఒప్పందాన్ని ఆమోదించి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఈ సమ్మిట్ జరుగుతోంది. ప్రారంభ, ముగింపు సమావేశాలతో పాటు, సమ్మిట్లో సుస్థిరమైన ఆర్థికం, ఇంధన పరివర్తనలు, ప్రకృతి, క్లైమేట్ నిబద్ధతలు, స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సుస్థిరమైన అభివృద్ధిని ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడం వంటి అంశాలపై ఉన్నత స్థాయి సెషన్లైన ఏడు ప్లీనరీ సెషన్లు ఉంటాయి. ఈ సమ్మిట్లో 24 కి పైగా థీమాటిక్ ట్రాక్లు కూడా ఉంటాయి.
డబ్ల్యూఎస్డిఎస్ 2025 ప్రపంచ నాయకులు, విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు, యువ నాయ కులను ఒకచోట చేర్చి ఎస్డీజీలను వేగవంతం చేయడానికి అవసరమైన సందేశాలను చర్చిస్తుంది. ఇందులో భాగస్వామ్యాల పాత్ర, COP30 కోసం చర్చలు, ఇన్పుట్లు ఉంటాయి. ఇది ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్ చేసిన COP33కి దారితీస్తుంది. జాతీయంగా నిర్ణయించబడిన సహకారాలపై (NDCలు) ఆశయాలను పెంచడానికి చర్యలు తీసుకుంటుంది మరియు భారత్ గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహిస్తుంది, ప్రస్తుత క్లైమేట్ యాక్షన్ సందర్భంలో ప్రపంచ బాటను నిర్దేశిస్తుంది.మీడియా సమావేశంలో టెరి (TERI) డైరెక్టర్ జనరల్ డాక్టర్ విభా ధావన్ మాట్లాడుతూ, “భాగస్వామ్యాలు అనేవి పరి వర్తనదాయక క్లైమేట్ యాక్షన్కు మూలస్తంభాల లాంటివి. డబ్ల్యూఎస్డిఎస్ 2025లో, సరిహద్దులను అధిగమిం చే సమష్టి ప్రయత్నాలను ప్రేరేపించడం, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, సుస్థిర భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మక పరిష్కారాలను నడిపించడం మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. డబ్ల్యూఎస్డిఎస్ 2025 ఈ పొత్తులను ఏర్పరచుకోవడానికి, ప్రభావవంతమైన మార్పును నడిపించడానికి ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగపడు తుంది” అని అన్నారు.”కీలక సుస్థిరత్వ లక్ష్యాలపై ప్రపంచం దారి తప్పుతున్నందున డబ్ల్యూఎస్డిఎస్ 2025 అనేది భాగస్వామ్యాలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మన భూగ్రహం తిరిగి కోలుకునేందుకు కార్యాచరణ మార్గాలను మనమంతా కలసి సృష్టించడానికి విభిన్న స్వరాలను ఏకతాటిపైకి తెస్తుంది” అని టెరి(TERI) డిస్టింగిష్డ్ ఫెలో శ్రీ అజయ్ శంకర్ అన్నారు.”ఈ సమ్మిట్ మూడు రంగాలపై ఆశయాలు, కార్యాచరణను ముందుకు నడిపిస్తుంది: సుస్థిర అభివృద్ధిని వేగ వంతం చేయడం, COP30 కోసం కీలక సందేశాలను రూపొందించడం, క్లైమేట్ జస్టిస్ను నిర్ధారించడానికి NDC 3.0 లో గొప్ప ఆశయం కోసం ఒత్తిడి చేయడం” అని డబ్ల్యూఎస్డిఎస్ క్యూరేటర్, టెరి(TERI) సీనియర్ ఫెలో డాక్టర్ షైలీ కేడియా నొక్కిచెప్పారు.డబ్ల్యూఎస్డిఎస్ 2025లో పాల్గొనే ప్రముఖ వక్తలలో క్లైమేట్ ఛేంజెస్ అంతర్ ప్రభుత్వ ప్యానెల్ చైర్ ప్రొఫెసర్ జిమ్ స్కీయా; ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ఉపాధ్యక్షుడు శ్రీ మార్టిన్ రైజర్; ఐరాస సస్టైనబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్; ఐక్యరాజ్యసమితిలో భారతదేశంలో ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ షోంబి షార్ప్; ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామి నాథన్; ఫిన్నిష్ మెటరోలాజికల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ పెట్టేరి తాలాస్; నటి, నిర్మాత, ఎస్డీజీలకు సంబంధించి కోసం ఐరాస సెక్రటరీ జనరల్ అడ్వకేట్ శ్రీ దియా మీర్జా, యూఎన్ఈపీ గుడ్విల్ అంబాసిడర్ టాటా క్యాపిటల్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ మనీష్ చౌరాసియా; క్లైమేట్ గ్రూప్ సీఈఓ శ్రీ హెలెన్ క్లార్క్సన్; ఆసియా అభివృద్ధి బ్యాంకు డైరెక్టర్ శ్రీసుజాత గుప్తా; ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్ మెంట్ (ICIMOD) డైరెక్టర్ జనరల్ డాక్టర్ పెమా గ్యామ్త్షో; నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ గ్లోబల్ డివిజన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అమండా మాక్స్వెల్, డ్యూష్ గెసెల్స్చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనార్బీట్ (GIZ) కంట్రీ డైరెక్టర్ డాక్టర్ జూలీ రెవియర్ ఉన్నారు.సుస్థిరతకు చేసిన కృషికి ప్రపంచ నాయకులను గుర్తించే సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డు (SDLA) ఈ సమ్మిట్లో ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. నాలెడ్జ్ డాక్యుమెంట్స్ ఆవిష్కరణలు, సమ్మిట్ కీలకమైన అంశాలను సంగ్రహించి, సంవత్సరం పొడవునా వాటాదారుల నిమగ్నతను ప్రోత్సహించే Act4Earth మ్యానిఫెస్టో ఇందులో ఉంటాయి.2001లో దిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్గా స్థాపించబడిన డబ్ల్యూఎస్డిఎస్ ఉన్నత స్థాయి మంత్రిత్వ సమావేశాలు, ప్లీనరీలు, థిమాటిక్ ట్రాక్లు, హరిత ఆవిష్కరణలపై ప్రదర్శనల ద్వారా సమష్టి చర్యను సమీకరించ డం, సుస్థిరత చర్చలకు సంబంధించి ఒక ప్రధాన ప్రపంచ వేదికగా రెండు దశాబ్దాలకు పైగా వారసత్వాన్ని కలిగి ఉంది.