ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణ యందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సిబ్బందితోపాటు నిర్వహించి స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమైనది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” స్వచ్ఛఆంధ్ర- స్వచ్ఛ దివస్” కార్యక్రమం లో భాగంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషను పరిసరాలను శుభ్రం చేయడం జరిగినది అనంతరం ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కాంపౌండ్ నందు మానవహారం నిర్వహించి ప్రతినిత్యం స్టేషన్ ఆవరణను శుభ్రంగా ఉంచే విధంగా చేయాలని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు ప్రతిజ్ఞ చేయించడమైనది.