NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాత్సల్య పథకమును సద్వినియోగం చేసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆస్పరి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకములను సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ అఖిల తెలిపారు సోమవారం మండల పరిధిలోని బిల్లేకళ్లు గ్రామంలో స్థానిక అంగన్వాడి కేంద్రంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలలో తల్లిదండ్రులు లేని అనాధ అభాగ్యులకు కోసంకేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం తీసుకొచ్చిందన్నారు కావున తల్లిదండ్రులు లేని పిల్లలు ఏప్రిల్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు దరఖాస్తు చేసుకున్న పత్రమును ఆలూరు ఐసిడిఎస్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు మరిన్ని వివరాలకు 97 05 624016 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author