NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీబీ ముక్తా అభియాన్ కార్యక్రమం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న టీబీ ముక్తా అభియాన్ కార్యక్రమం గార్గేయపురం పీ హెచ్ సి పరిధిలోని పడిదెం పాడు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్. రఘు  పాల్గొని మాట్లాడుతూ గ్రామం లో రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రి పూట చెమటలు, బరువు తగ్గిపోవడం, 60 ఏళ్ళు పైబడిన వారు,పొగ త్రాగువారు, మద్యం సేవించు వారు, పౌస్తికాహర లోపం ఉన్న వారికి అందరికి టీబీ గళ్ళ పరీక్షలు మరియు ఎక్షరేలు చేయించాలన్నారు. ఇందులో భాగంగా నిక్షయ్ వాహన్,నిక్షయ్ శిబిరలు ఏర్పాటు చేసి జన భగీదారి లో భాగంగా గ్రామంలో ప్రజలకు టీబీ గురించి తెలియచేసి,టీబీ వ్యాధి గురించి ఉన్న మానసిక రుగ్మతను తీసివేయాలని, వీటితో పాటు ఎవరైనా నిరుపేద టీబీ రోగులకు గ్రామ స్థాయిలో దాతల సహకారంతో ప్రతి నెల పౌష్టికాహారం అందచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అబ్దుల్ అనిద్ ,ఆరోగ్య విస్తరణ అధికారి వెంకట రమణ, పి హెచ్ ఎన్ హనుమంతమ్మ , హెల్త్ సూపెర్వైసర్ నాగమణి,ఆరోగ్య కార్యకర్త కళావతి, ఎం ఎల్ హెచ్ పి సునీత,ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనీస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *