PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాఠీచార్జ్ చేయడం దారుణం: నారా లోకేష్

1 min read


పల్లెవెలుగు వెబ్: అమరావతి రైతులు చేపడుతున్న పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, పాదయాత్ర చేస్తున్నవారి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటపై నారా లోకేష్ స్పందించారు. పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ మేరకు లోకేష్ ఓ ట్వీట్ చేశారు.

About Author