NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బదిలీల్లో సహకరించిన ఏపీ ఎన్జీవోస్ నాయకులకు కృతజ్ఞతలు

1 min read

గత ప్రభుత్వం నుండి చేసిన పోరాట ఫలితమే నేటికీ ఫలించింది

ఏపీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్

రాష్ట్ర నాయకులకు,జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేసిన సచివాలయ బృందం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరులో,ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న సెక్రెటరీలు ఇటీవల వారికి సంబంధించిన బదలీ ల మార్గదర్శకాలలో ఇతర మున్సిపాలిటీ లకు బదలీ లు చేయాలన్న నిబంధనలు తొలగించి అదే మున్సిపల్ కార్పోరేషన్/మున్సిపాలిటీలలో ఉన్న వార్డ్ లకు బదలీ చేయాలని  ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ కి చేసిన విజ్ఞప్తి మేరకు. నాయకత్వం  అధ్యక్షుడు కామ్రేడ్ అలపర్తి విద్యా సాగర్ ప్రధాన కార్యదర్శి డివి రమణ ల చొరవతో సంబంధిత మంత్రి వర్యులు,అధికారులు దృష్టి కి తీసుకొచ్చిన వెంటనే స్పందించిన ప్రభుత్వం  మున్సిపాలిటీ  పరిధిలోనే సెక్రటరీ లను బదలీ చేయాలని నిన్న ఉత్తర్వులు జారీచేశారు.ఈ సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా ఏలూరు వార్డ్ సెక్రెటరీల బృందం వచ్చి సన్మానించారు.ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష,కార్యదర్సులు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ఏర్పడనప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న సుమారు ఒక లక్షా ఇరవైదు వేల మంది తరపున గత ప్రభుత్వం నుంచి చేసిన పోరాటంతో నేటికీ ఫలించి వీరందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేయంచి నేటి వరకు ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్  వీరి పక్షాన నిలబడిందని తెలుపుతూ ఎన్జీజివోస్ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *