20 నుంచి 411 వ ఆరాధన రథోత్సవం ప్రారంభం
1 min read
శ్రీ విజయేంద్ర తీర్థ స్వాముల,,,411, వ,ఆరాధన రథోత్సవం, 20-06-2025- నుంచి ప్రారంభం,
న్యూస్ నేడుహొళగుంద: హొళగుంద మండలం కేంద్రంలో,శ్రీ విజయేంద్ర తీర్థ స్వాముల ఆరాధన మహోత్సవం సందర్బంగా, హొళగుంద, అర్చకులు, మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుదీంద్ర తీర్థ శ్రీపాదంగలవారిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు,స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ నేల 20-06-2025 నుండి,24-06-2025 వ తేధి వరకు ఆరాధన పూజలు, అభిషేకాలు జరుగుతాయి,శ్రీ కోట అంజినేయ స్వామి దేవాలయం లో వెలిసిన శ్రీ విజయేంద్ర తీర్థ స్వాముల ఆరాధన మహోత్సవం సందర్బంగా 24-06-2025 నా మహా రథోత్సవం,మేళాలు,బజనలు,కోలాటాలు ఇటు వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమం తో అంగరంగ వైభవంగా జరగనున్నది గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని, పవన్ స్వామి, కిట్టు స్వామి అర్చకులు తెలిపారు.
