డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించడమే లక్ష్యంగా పనిచేయాలి
1 min read
ఈనెల 26న ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో అవగాహన ర్యాలీ
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించడంలో అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో కలిసి సంబంధిత అధికారులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈనెల 26న ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ప్రజలందరిలో చైతన్యం తీసుకువచ్చేలా అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ నుంచి సంజీవనగర్ గేటు వరకు వెళ్లి తిరిగి ఎస్పిజి గ్రౌండ్ వద్దకు ర్యాలీ చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ర్యాలీ అనంతరం పాల్గొన్న వారందరితో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించాలన్నారు. ఈ ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ, పోలీస్ శాఖ, ఎక్సైజ్, వైద్యారోగ్య, ఐసిడిఎస్, ఎడ్యుకేషన్, మున్సిపల్ కమిషనర్లు, కళాశాల, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొంటారన్నారు. అలాగే జిల్లా లోని డివిజన్ మరియు మున్సిపాలిటీలలో కూడా అవగాహన ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ఈ ర్యాలీ విజయవంతానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు కలెక్టర్ పేర్కొన్నారు.