PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాదాస్పదంగా మారిన స్థల సమస్య

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పట్టణంలో ని రాజవీధి లో రావి మాను కట్ట వద్ద గల రస్తా స్థల సమస్య ఆక్రమణలతో వివాదస్పదo గా మారింది. గ్రామ పంచాయతీ బోర్డు వడ్ల వీధి 6 వార్డు అసైన్మెంట్ నెంబర్ 766 స్థలంలో ఉత్తరము న రస్తా ఉంది. ఈ రస్తాలో గతంలో ఎద్దుల బండ్లు కూడా వెళ్ళేవని స్థానిక ప్రజలు చెప్పారు. ఇపుడు చుట్టు ప్రక్కల ఇళ్ల వారు ముందుకు వచ్చి రస్తాను ఆక్రమించుకోవడం వల్ల రస్తా మూసుకుని పోయింది. ఆ దారిని పూర్తిగా మూసివేసి ఒక వ్యక్తి గోడ కట్టుటకు ప్రయత్నం చేయగా , అది వివాదాస్పదo గా మారింది. స్థానికులు గ్రామ పంచాయతీ కార్యదర్శి కి , పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఈ విషయం పై కార్యదర్శి హరిలీల ను వివరణ అడగగా ఆ రస్తాకు సంబంధించి డాక్యుమెంట్లు , రికార్డులు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

About Author