PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్కార్ బరిలో తెలుగు చిత్రం మనసానమ:

1 min read


పల్లెవెలుగు వెబ్: 2020లో విడుదలైన షార్ట్ ఫిలిం ‘మనసానమః’ ఆస్కార్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం అకాడమీ సభ్యుల ఓటింగ్ కోసం ప్రదర్శితమవుతోంది. కొత్త దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ విడుదలైనప్పటి నుంచి 950+ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అలాగే 300+ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. ఆస్కార్ బరిలో నిలిచినందుకు గర్వకారణంగా ఉందని చిత్ర బృందం ప్రకటించింది. అన్ని చిత్రాలను దాటి అస్కార్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు దీపక్ రెడ్డి.

About Author