PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరంకుశ వైసిపి ప్రభుత్వ కోరలు ఊడి పోయాయి..

1 min read

మంచి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి..

చింతమనేని యువసేన రక్తదానం

యువత సేవాభావం కలిగి ఉండటం ఎంతో అభినందనీయం..

టిడిపి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : చింతమనేని జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు సర్వజన ఆసుపత్రిలో మంగళవారం రక్తదాన కార్యక్రమం నిర్వహించరు. పెదవేగి మండలం కొప్పులవారి గూడెం యువత – యువత సేవా స్ఫూర్తిని అభినందించి చింతమనేని ప్రభాకర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా వ్యతికరేక నిర్ణయాలతో, అవినీతి, అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తూ నిరంకుశ పాలన అందిస్తున్న వైసిపి ప్రభుత్వ కోరలు ఊడి పోయాయని, రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని మాజీ ప్రభుత్వ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.జనవరి 3వ తేదీన జరగనున్న చింతమనేని ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగి మండలం కొప్పులవారి గూడెంకి చెందిన చింతమనేని యువసేన ఆధ్వర్యంలో ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో సామూహిక రక్త దాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ రక్తదానం చేయడం అంటే ఒకరికి ప్రాణం చేసినట్లే అని, యువత సేవా స్ఫూర్తిని కలిగి ఉండటం అభినందనీయం అని అన్నారు.కొప్పులవారి గూడెం యువత చలపాటి శేఖర్, తాటిగడప నాగరాజు, యర్రా నవీన్, ఉప్పులూరి నవీన్, ముసునూరి రమేష్, సాతునూరి పవన్, బడుగు శివ, యంట్రపాటి రాజాబాబు, యంట్రపాటి రవితేజ, కంగాల శ్యాంలను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పెదవేగి, దెందులూరు, పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు బొప్పాన సుధ, మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), లావేటి శ్రీనివాస రావు, సమన్వయ కమిటీ తాతా సత్యనారాయణ, నేతల రవి, గుత్తా అనిల్, మోరు శ్రావణి, తెలుగు యువత అధ్యక్షుడు మోతుకురి నాని,పసుమర్తి మధు, దేవరపల్లి ఆదాం సహా పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author