PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వచ్చే ఏడాది టీ-20 వరల్డ్‌కప్ వేదికలు ఖరారు

1 min read


పల్లెవెలుగు వెబ్: 2022లో టీ-20 ప్రపంచకప్ కంగారు గడ్డపై జరగనుంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు తాజాగా వేదికలను ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబర్ 16 నుంచి నవంబర్13 వరకు జరిగే పొట్టి ప్రపంచ‌కప్ కోసం 7 వేదికలను ఖరారు చేశారు. మొత్తం 45 మ్యాచ్‌లకు బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్, పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్ నగరాలు వేదికగా కానున్నాయి. ఫైనల్స్ మ్యాచ్‌కు మెల్బోర్న్‌లోని ఎంసీజీ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇక సెమీ ఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్‌లో నిర్వహించనున్నారు. కాగా, ఇటీవల యూఏఈ వేదికగా టీ-20 ప్రపంచ కప్ ముగిసింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆసీస్ ఘనవిజయం సాధించి కప్‌ను ఎగురేసుకుపోయింది.

About Author