PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్యసభకు వైసీపీ నుంచి ఆ నలుగురు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీవెంకటేశ్, సురేష్ ప్రభుల పదవీ కాలం జూన్ 21న ముగియనుంది. ఈ నాలుగు స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి వైకాపా నుంచి ప్రాతినధ్యం వహిస్తున్నారు. ఆయన స్థానంతో పాటు మిగిలిన స్థానాలు కూడ వైకాపాకే దక్కనున్నాయి. విజయసాయిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరో స్థానం నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకో స్థానం గుంటూరు జిల్లాకు చెందిన నేతకు ఇస్తారని సమాచారం. నాలుగింటిలో మూడు వైసీపీ నేతలకు ఇవ్వగా..ఒక స్థానం ఉత్తర భారతదేశానికి చెందిన కార్పొరేట్ దిగ్గజానికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

    

About Author