PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కు.. రిస్క్ లేకుండా అధిక వ‌డ్డీతో .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు. అధిక వడ్డీ రేటు, ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్‌లో లేదా కొన్ని బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. ముఖ్యంగా పథకంలో డబ్బులు పొదుపు చేయాలంటే ఈ ఖాతా తెరిచే సయమానికి సంబంధిత ఖాతాదారుని వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వయో సడలింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలో సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షల వరకు డిపాజిట్లపై త్రైమాసిక వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం ఎస్‌సీఎస్‌ఎస్‌ వడ్డీరేటు 7.4శాతం ఉండగా కేంద్రం త్రైమాసిక ప్రాతిపదికన ఇతర పథకాలతోపాటు ఈ స్కీమ్‌ వడ్డీ రేటును సవరిస్తుందనే విషయాల్ని గుర్తించుకోవాలి. ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాలో చేసిన పెట్టుబడి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొంద‌వ‌చ్చని ఆర్థిక నిపుణులు తెలిపారు.

                                     

About Author