PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాగంటి ఆలయ చైర్మన్ గా తోట బుచ్చిరెడ్డి

1 min read

పల్లెవెలుగువెబ్​, బనగానపల్లె: తిరుమల కొండల్లో వెలసిన యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్​గా మండలంలోని మీరపురం గ్రామానికి చెందిన తోట బుచ్చిరెడ్డి నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అధికారులకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్​ కారణంగా ఆలయ చైర్మన్​ ఎంపికపై ఆలస్యమైనట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోట బుచ్చిరెడ్డి మాట్లాడుతూ యాగంటి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్​గా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాటసాని వంశీయులు, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహకారంతో పదవి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

About Author