PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిప్పుల వాగులో.. ఇద్దరు బాలురు గల్లంతు

1 min read

– మృత దేహాలు లభ్యం
పల్లెవెలుగు, వెబ్​ వెలుగోడు: మండలం లోని వేల్పనూరు వద్ద గల నిప్పుల వాగులో శుక్రవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో ఇద్దరు పిల్లలు సుజయ్ (18), సుభాష్ (12) గల్లంతేనా సంఘటన జరిగింది. వేల్పనూరు కు చెందిన రాముడు కుమారుడు సుజయ్ , హుసేనయ్య కుమారుడు సుభాష్ గొర్రెల మేపడానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ , వాగులో కాళ్లు కడుక్కోవడానికి వెళ్లి ప్రమాద వశాత్తు పడి మునిగి పోవడం జరిగింది ఈ నిప్పుల వాగు వెంట వారిద్దరూ కొట్టుకొని పోయారు. శనివారం నంద్యాల దగ్గర పుసులురు వద్ద కుందూ నదిలో సుభాష్ మృతదేహం లభ్యమైంది.. అలాగే సంత జూటూర్ పికప్ ఆనకట్ట వద్ద సుజయ్ మృత దేహం లభ్యం .వీరి మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపి , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెస్తున్నట్లు ఎస్.ఐ జగన్ మోహన్ తెలిపారు.

About Author