NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద్విచక్ర వాహనాలు దొంగలించే నిందితుడు అరెస్టు… జిల్లా ఎస్పీ

1 min read

రూ. 35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

మూడున్నర నెలల్లోనే 5 వేల సిసి టివి కెమెరాలు ఏర్పాటు చేశాం.

సిసికెమెరాల సహాయంతో ఈ కేసును సులువుగా చేధించాం.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్​ఆర్​) మరియు ఎంపీ  నిధులతో మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు  చేస్తాం.

గస్తీలు పెంచి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తాం.

కర్నూలు, న్యూస్​ నేడు:  35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితున్ని గోనెగండ్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో నిందితుని వివరాలను  జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ…కర్నూలు, ఎమ్మిగనూరు , గోనెగండ్ల ప్రాంతాలలో బైక్ లు దొంగలిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ముద్దాయిని పట్టుకోవడాని చర్యలు చేపట్టామన్నారు. ఈ రోజు గోనెగండ్ల మండలం కు చెందిన కుర్వ వెంకటేష్ నుండి 30 బైక్ లు రికవరీ చేయడం జరిగిందన్నారు.  కర్నూలు  , ఎమ్మిగనూరు, గోనెగండ్ల, దేవనకొండ , కోడుమూరు , ఓర్వకల్లు తదితర  ప్రాంతాలలో 30 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు ఒప్పుకున్నాడన్నారు.ఆ బైక్ చాస్ నెంబర్ ద్వారా బైక్ లకు సంబంధించిన ఓనర్లకు  బైక్ లు అప్పగిస్తామన్నారు.  మరొ ఇద్దరు బైక్ నిందితులు ఉన్నట్లు తెలిసింది, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. మరిన్ని బైక్ లను కూడా రికవరి చేస్తామన్నారు. చోరి చేసిన బైక్ లను జొన్నగిరి ప్రాంతాలలో పొలాల పనులు చేసుకునే రైతులకు అమ్మివేశాడన్నారు. పొలలాకు వెళ్లే రైతులకు రూ. 4 వేలు, 5 వేలకు ఇద్దరి కి అమ్మివేశాడన్నారు. పార్కింగ్ చేసిన వాహనాలను అప్పటికప్పుడు దొంగలించడం, వెంటనే అమ్మి వేయడం చేసేవాడన్నారు.  పోలీసుల తనిఖీల్లో దొంగలించిన వాహనాలు బయట పడ్డాయన్నారు.28 బీట్స్ ను అన్నింటిని ఈ – బీట్స్ గా చేశామన్నారు.  గస్తీలు పెంచి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.జిల్లాలో మూడు న్నర నెలల్లోనే దాదాపు 5 వేల సిసిటివి కెమెరాలను ప్రజల సహాకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఆ సిసి కెమెరాల సహాయంతో ఈ కేసును సులువుగా చేధించడానికి వీలయిందన్నారు. ఎక్కడైనా వాట్సాప్, టెలి గ్రాం  గ్రూపులలో  ఏపికె పైల్స్ వస్తే వాటిని క్లిక్ చేయకూడదు, ఒపెన్ చేయకూడదన్నారు.  మీడియా వారు కూడా సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన చేయాలన్నారు.

నగదు రివార్డులతో అభినందించిన … జిల్లా ఎస్పీ.

ద్విచక్ర వాహనాల దొంగను  అరెస్టు చేయడంలో కృషి చేసిన గోనెగండ్ల సి.ఐ  విజయ భాస్కర్  మరియుతేజేశ్వర కుమార్, దేవరాజు  రాజు,లక్ష్మీకాంత్, వీరేష్ గౌడ్, బ్రహ్మయ్య ,   శ్రీనివాసులు, రమేష్ లను జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  నగదు రివార్డులు అందజేసి అభిన౦దించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *