PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాజ్ పేయి వ్య‌క్తి కాదు.. వ్య‌వ‌స్థ : టీజీ వెంక‌టేశ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ ప్ర‌ధాని స్వర్గీయ వాజ్ పెయ్ గారి జన్మదిన సందర్భంగా బీజేపీ సుపరిపాలన దినోత్సవం నిర్వహించింది. క‌ర్నూలు బీజేపీ కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ ఎంపీ టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి ఒక వ్య‌క్తి కాద‌ని, ఒక వ్య‌వ‌స్థ అని టీజీ వెంక‌టేష్ అన్నారు. ఆయ‌న పార్ల‌మెంట్ లో ప్ర‌సంగిస్తుంటే ప్ర‌తి ఒక్క‌రూ పార్టీల‌క‌తీతంగా శ్ర‌ద్ధ‌గా వినేవార‌ని తెలిపారు. విలువ‌ల‌తో కూడిన రాజకీయాలు చేసిన వ్య‌క్తి వాజ్ పేయి అని చెప్పారు. ఆయ‌న త‌ల‌చుకుని ఉంటే ఒక్క ఓటు తేడాతో ఆయ‌న ప్ర‌భుత్వం కూలేది కాద‌ని అన్నారు. పార్ల‌మెంట్ లో ఆమోదించిన బిల్లులన్నీ ప్ర‌ల‌జ అభివృద్దికి ఉప‌యోగ‌ప‌డేవేన‌ని చెప్పారు. వాజ్ పేయి కాంక్షించిన సుప‌రిపాల‌న అందించే దిశ‌గా మోడీ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు.

                                  

About Author