మనం చదువుకున్న పాఠశాలకు మన వంతు సహాయం చేయాలి
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: మనం చదువుకున్న పాఠశాలకు మన వంతు సహాయంగా అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు లో సుబ్బారావు పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రాథమిక విద్య అభ్యసించిన పాఠశాల.. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ పాఠశాలలో రూ.13 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులకు నందికొట్కూరు ఎమ్మెల్యే తో కలిసి జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఎంఎఫ్ నిధుల కింద 13 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్, పెయింటింగ్, రూమ్ సీలింగ్, ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్, తదితర 5 ముఖ్యమైన పనులను చేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా హెడ్ మాస్టర్ తన దృష్టికి తీసుకుని వచ్చిన మిగిలిన పనులను కూడా 2 నెలల్లో శాంక్షన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు… తాను చదివిన పాఠశాలలో ప్రతిరోజు రెండు గంటల పాటు క్రికెట్ ఆడేవాడినని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు.. పిల్లలు పాఠశాల సమయం అయిపోయిన తర్వాత క్రీడల్లో కాసేపు పాల్గొని ఆడుకోవాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా జిల్లాలో 2 వేల 600 పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు… మనం చదువుకున్న పాఠశాలకు, చదువుకునే రోజులలో సాయం చేసిన వ్యక్తులకు తిరిగి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలన్నారు… పి4 కార్యక్రమంలో భాగంగా 69 మందిని మార్గదర్శకులుగా బంగారు కుటుంబాలకు టై అప్ చేయడం జరిగిందన్నారు… ఇందులో భాగంగా కర్నూలు నగరంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టేడియంను త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.. నందికొట్కూరులో ఉన్న డిగ్రీ కళాశాలలో కూడా పెయింటింగ్ పనులు చేయించడం జరిగిందన్నారు… మనం చదువుకున్న పాఠశాలకు, పేదరికం లో ఉన్న ప్రజలకు మన వంతు సాయం చేయాలని కలెక్టర్ తెలిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ కలెక్టర్ గారు ఆయన చదివినటువంటి పాఠశాలను గుర్తుపెట్టుకుని అభివృద్ధి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయమన్నారు.. నందికొట్కూరు ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ కి సంబంధించిన పనులు కూడా టెండర్ దశలో ఉన్నాయన్నారు.. పదోతరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది డ్రాప్ ఔట్ అవుతున్నారని పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలను తీసుకుని రావాలని కలెక్టర్ ని కోరారు.. నందికొట్కూరు ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాల తలసరి ఆదాయం పెంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
