NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం

1 min read

ఏపియుడబ్యూజే 2025 డైరీ ఆవిష్కరణ చేసిన ప్రదీప్ రెడ్డి

మంత్రాలయం, న్యూస్ నేడు​ :  జర్నలిస్టుల కు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహయ సహకారాలతో అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం  ఎమ్మిగనూరు లో భీమ నిలయం లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ప్రదీప్ రెడ్డి ఏపియుడబ్యూజే 2025 డైరీ ని జర్నలిస్టుల అధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం ఏపియుడబ్యూజే కమిటీ సభ్యులు ప్రదీప్ రెడ్డి ని శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విలేకరులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్యూజే తాలుకా అధ్యక్షులు వగరూరు జయరాజ్, ప్రధాన కార్యదర్శి హుశేని, కోశాధికారి షాబువలి, కార్యనిర్వాహక కార్యదర్శి సూర్యనారాయణ చార్యులు ,సాగర్,మండల గౌరవాధ్యక్షులు రానోజిరావు, మండల అధ్యక్షులు భీమరాయ, నాగరాజు, శివ రాం, వడ్డే వెంకట్ తదితరులు ఉన్నారు.

About Author