PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం..

1 min read

– ఎమ్మెల్యే కాటసాని కి ఘన సన్మానం చేసిన సోషల్ మీడియా బృందం .
పల్లెవెలుగు, వెబ్ పాణ్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోషల్ మీడియా విభాగం బలోపేతం చేయడంలో లో భాగంగా నియోజకవర్గ స్థాయి కన్వినర్, కో -కన్వినర్ లను నియమించారు ఈ సందర్భంగా తమకుపై నమ్మకం ఉంచి నియోజకవర్గ స్థాయి కన్వీనర్ గా కో కన్వీనర్లుగా నియమించిన సభ్యులు ఆదివారం నాడు పాణ్యం శాసనసభ్యులు మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు &నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , మరియు పాణ్యం నియోజకవర్గ యువనేత కాటసాని శివ నరసింహా రెడ్డి ని కలసి సోషల్ మీడియా బృందం శాలువా మరియు బొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్లను ఉద్దెశించి మాట్లాడుతూ జగనన్న ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలని ప్రజల లోకి చేరావేయాలని సూచించడం జరిగింది.సోషల్ మీడియా సభ్యులు మరింత ఉత్సహంగా పని చేయాలన్నారు పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కన్వినర్ రాఘవేంద్ర రెడ్డి, కో కన్వినర్ లు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రవి వర్మ, మన్సూర్ బాషా మరియు సోషల్ మీడియా సభ్యులు డేవిడ్ శేషు,తులువ శ్రీకాంత్, సంతోష్, నాయుడు, రాజేష్, పవన్, ప్రసాద్, లక్ష్మి ప్రసాద్, హేమంత్ రెడ్డి, రామ్ గోపాల్, మీడివేముల నారాయణ, తదితరులు పాల్గొన్నారు .

About Author