NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ ఆవేశం ఏమైంది.. పోరాడండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, లేనిపక్షంలో కేంద్రం ఏంచేస్తుందో దాన్ని సాధించాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు. ప్రత్యేక హోదా సాధనపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉన్న ఆవేశం ఇప్పుడు ఏమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆయన ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల ముందు, హోదా గురించి చేతులు కట్టుకోనైన అడగవచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు కేసులకు భయపడి చేతులు కట్టుకొని, నాడు హోదాను తాకట్టు పెట్టారని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. అసలు కేసులే లేని చంద్రబాబు వాటికి భయపడి హోదాను తాకట్టు పెడితే, 32 ఆర్థిక నేరాల కేసుల అభియోగాలను ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డి వాటికి భయపడి నోరు విప్పడం లేదని ప్రజలు అనుకునే అవకాశం లేదా? అని ప్రశ్నించారు.

                                          

About Author