కోర్టు పరిధిలో ఉన్న స్థలాల్లో ఎలాంటి పనులు చేపట్టరాదు
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు : మండల పరిధిలోని మాధవరం గ్రామంలో వివాస్పద జగనన్న కాలనీ కోర్టు పరిధిలో ఉందని అక్కడ ఎవరూ కూడా ఎలాంటి పనులు చేపట్టరాదని తహసీల్దార్ రవి సూచించారు. గ్రామంలో సర్వే నెంబర్ 238 లో కొంత మంది స్థానికులు జేసిబి తో పనులు చేస్తున్నారని స్థానికులు సమాచారం ఇవ్వడం తో ఆర్ ఐ జనార్దన్ ను విచారణ నిమిత్తం పంపినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా సరే వివాస్పద జగనన్న కాలనీ లో ఎలాంటి పనులు చేసిన, కబ్జాలు చేసిన, ఆక్రమించిన అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ ఐ విచారణ నివేదిక ఆధారంగా జిల్లా అధికారులకు పంపడం జరుగుతుందని అనంతరం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.