మన ఆరోగ్యం కొరకే యోగా…
1 min read
జూన్ 17న 5 వేల మందితో యోగా…
కర్నూల్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు…
కర్నూలు , న్యూస్ నేడు: యోగ కార్యక్రమం మన ఆరోగ్య కోసమేనని దీనిని అందరూ అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ప్రజలను కోరారు.గురువారం ఉదయం కర్నూలు పట్టణములో పర్యాటక ప్రదేశము మరియు చారిత్రాత్మక కట్టడమైన కొండారెడ్డి బురుజు దగ్గర చేపట్టిన యోగ కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ… మే 21 నుండి జూన్ 21 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అందులో భాగంగా పర్యాటక ప్రదేశమైన కొండారెడ్డి బురుజు వద్ద ఈరోజు యోగ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. యోగ మన ఆరోగ్యం కోసమేనని యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. యోగ కార్యక్రమాలలో పాలుపంచుకునే వారి సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువగా చేయగలిగామని తెలిపారు. ఈనెల 17వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్మికుల తో మరియు స్థానికులతో కలిసి 5,000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నా మని దానిని కూడా ఈ రోజు లాగా విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా సీఈవో సెట్కూర్ వేణుగోపాల్ మాట్లాడుతూ… జిల్లాలో అనేక యోగ కార్యక్రమాలు ఇంతవరకు నిర్వహించుకున్నామని, ఈ నెల 21వ తారీకు న జరుగు యోగ కార్యక్రమంలో పాల్గొనే దానికి కర్నూలు జిల్లా నుండి 10 లక్షల 70 వేల మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా పర్యాటక ప్రదేశాలైన మంత్రాలయం పుణ్యక్షేత్రం , ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ , జగన్నాథ గట్టు , కొండారెడ్డి బురుజు మొదలగు ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించుకుని యోగాతో పాటు టూరిజమును కూడా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి , సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, డిఎస్ఓ రాజా రఘువీర్, డిఎస్పి రాఘవేంద్ర ఆచారి, జిల్లా టూరిజం అధికారి విజయ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగ శివలీల, ఎన్సిసి కమాండెంట్ ప్రసాద్ , రాష్ట్ర యోగఅసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అవినాష్, ,జిల్లా ఆయుష్ అధికారులు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ప్రసాద్, కార్పొరేటర్ లు కైప పద్మలతా రెడ్డి,నిలోఫర్, ఎన్ సిసి విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు.
