PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువకుడు అదృశ్యం… కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: మండల పరిధిలోని కడు మూరు గ్రామానికి చెందిన అబ్దుల్ అజీస్ కుమారుడు అబ్దుల్ రహీం(24)29వ తేదీన అదృశ్యం అయ్యాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.మారుతి శంకర్ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు అబ్దుల్ రహీమ్ కాలుకు బైక్ సైలెన్సర్ కాలడం వలన నందికొట్కూరు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ దగ్గర చూపించుకుని రమ్మని తండ్రి కుమారుడికి డబ్బులు ఇచ్చి నందికొట్కూరుకు పంపించాడు.తర్వాత తండ్రి కర్నూలులో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్లాడు.తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులను అడిగితే కుమారుడు రాలేదని వారు తెలిపారు.తమ బంధువులను విచారించినా రాలేదని అనడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు.

About Author