యువత భారత రాజ్యాంగం పై అవగాహన కలిగి ఉండాలి
1 min read
సెట్కూరు సీఈఓ డా!! కె.వేణుగోపాల్
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు మరియు జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖలు డాక్టర్స్ కాలనీ లోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో సంవిధాన్ హత్య దివస్ ను పాటించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా శాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సెట్కూరు కార్యనిర్వహణ అధికారి డాక్టర్ వేణుగోపాల్, జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ అధికారి శ్రీమతి విజయ , రిటైర్డ్ అధ్యాపకులు రమేష్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఇందిరా శాంతి మాట్లాడుతూ ఎమర్జెన్సీ విధించడం అనే తప్పిదం కారణంగా శ్రీమతి ఇందిరాగాంధీ తన ప్రాబల్యాన్ని కోల్పోవలసి వచ్చిందని తెలిపారు. సెట్కూరు సిఇఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) 1975 జూన్ 25 నుండి అమలులోకి వచ్చి 1977 మార్చి 21న 1977 మార్చి 21 వరకు, అంటే 21 నెలల పాటు కొనసాగిందని తెలిపారు.అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి 50 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25న సంవిధాన్ హత్య దివస్ గా జరుపుకోవాలని కేంద్రం ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసి నదని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసర పరిస్థితి సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో, రాజ్యాంగ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నివాళులు అర్పించేందుకు మరియు ప్రజలకు భారత రాజ్యాంగ విశిష్టత తెలియపరిచే అవగాహనా కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు మరియు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం కావాలని తెలిపారు.ఎమెర్జెన్సీ వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలందరూ ముఖ్యంగా యువత రాజ్యాంగము పట్ల అవహగాహన పెంచుకొని రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలని కోరారు. జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ అధికారి శ్రీమతి విజయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలలో చైతన్యం తేవడం కోసం సంవత్సర కాలం పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు.ప్రధాన వక్త పదవీ విరమణ చేసిన అధ్యాపకులు శ్రీ రమేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటికి మూడు సార్లు ఎమర్జెన్సీ విధించినప్పటికీ రెండు సార్లు యుద్ధాల కారణంగా విధిస్తే 1975 జూన్ 25 వ తేదీన శ్రీమతి ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ చరిత్ర పుటలలో నిలిచిపోయిందని, కేవలం ఈ చర్య కారణంగా ఆ తరువాత వచ్చిన ఎన్నికలలో తీవ్ర పరాభవాన్ని మూట కట్టుకోవలసి వచ్చిందని, శక్తివంతమైన ప్రధానిగా పేర్గాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ చరిత్రలో లిఖించిన చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ కాలం నిలిచి పోయిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు మాదన్న, నాగరత్న, వెంకటస్వామి, నాగేశ్వరరావు రోషన్న, సోమశేఖర్, షాజిదబీ, సుజాత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.