NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్

1 min read

రహదారి నిర్మాణంలో నాణ్యత లో రాజీపడవద్దు,కాంట్రాక్టర్ కు,అధికారులకు చైర్పర్సన్ సూచన

కూటమి ప్రభుత్వంలో దశాబ్దాలకల నేటికి నెరవేరింది

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్ బుధవారం పెదపాడు మండలంలోని సత్యవోలు నుంచి వడ్డీగూడెం వరకు నిర్మించబడుతున్న రహదారి పనులను పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నిర్మాణ ప్రగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మార్గంలో రహదారి సమస్య పలు దశాబ్దాలుగా స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంది. వర్షాకాలంలో ప్రజలు తీవ్రంగా తల్లడిల్లే పరిస్థితులు నెలకొనేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించడంపై చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు రహదారి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి,” అని అన్నారు.ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత వేలాది మంది ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలిగిస్తుందని, వ్యాపార, రవాణా కార్యకలాపాలకు గణనీయమైన ఊతమిస్తుందని ఆమె పేర్కొన్నారు.పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని కాంట్రాక్టర్‌కు,అధికారులకు ఆమె సూచనలు చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *