PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉప్పెన’ జోడికి.. ‘మైత్రీ’ గిఫ్ట్​

1 min read

బుచ్చిబాబు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చిత్రం ‘ఉప్పెన’.. హీరోహీరోయిన్లకు మైత్రీ నిర్మాణ సంస్థ భారీ గిఫ్ట్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరో వైష్ణవ్​తేజ్​, హీరోయిన్​ కృతిశెట్టి నటించినన ‘ ఉప్పెన’ మూవీ సంచలన విజయం సాధించింది.. ఇప్పుడు భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. వంద కోట్ల రూపాయల కలెక్షన్లకు చేరువలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్లకు మైత్రీ నిర్మాణ సంస్థ నగదు బహుమతులు అందించిందట. హీరో వైష్ణవ్‌ తేజ్‌కి కోటి రూపాయలు.. హీరోయిన్‌ కృతికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. కాగా, తొలుత ఈ సినిమా పారితోషికంగా వైష్ణవ్‌కు రూ.50 లక్షలు, కృతికి రూ.10 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా విజయం కారణంగా అటు వైష్ణవ్, ఇటు కృతి వరుస అవకాశాలు అందుకుంటున్నారు. కాగా, ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబుకు కూడా కోటి రూపాయల విలువైన బహుమతిని మైత్రీ అధినేతలు ఇవ్వబోతున్నారని విశ్వసనీయ సమాచారం.

About Author