PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓట‌మి భ‌యంతోనే.. మైండ్ గేమ్

1 min read
టీడీపీ నాయకులతో టీజీ భరత్​

టీడీపీ నాయకులతో టీజీ భరత్​

టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​
పల్లెవెలుగు, కర్నూలు టౌన్​
క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో ప్రత్యర్థులకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని, అందుకే మైండ్​ గేమ్​ ఆడుతున్నారని నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ ఆరోపించారు. మంగ‌ళ‌వారం మౌర్య ఇన్‌లో 43, 49, 50, 51, 52 వార్డుల‌కు సంబంధించిన కార్పోరేట‌ర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ముఖ్య నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వహించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాల‌న్న దానిపై అంద‌రితో చ‌ర్చించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ఇప్పుడు జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజ‌యం సాధిస్తార‌ని ప్రత్యర్థులకు తెలిసిపోయింద‌న్నారు. అందుకే ఏమీ చేయ‌లేక త‌ప్పుడు ప్రచారం చేషస్తున్నార‌ని అన్నారు. తాను టిడిపిని వీడి వేరే పార్టీలో చేరుతున్నాన‌ని వ‌స్తున్న పుకార్లలో నిజం లేద‌న్నారు. రాజ‌కీయాల్లో హుందాగా వ్యవహరిస్తామన్నారు. కేవ‌లం టిడిపి అభ్యర్థుల‌ను మాన‌సికంగా దెబ్బకొట్టేందుకే ప్రలోభాల‌కు గురిచేస్తున్నార‌న్నారు. 15 రోజుల స‌మ‌య‌మే ఉంద‌న్న ఆయ‌న‌.. వార్డుల్లో అభ్యర్థులు, నాయ‌కులంద‌రూ క‌లిసిమెలిసి క‌ష్టపడాలని చెప్పారు. కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా గెలుస్తామ‌న్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు, వార్డుల నాయ‌కులు పాల్గొన్నారు.

About Author