PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నుండి 150 కుటుంబాలు టిడిపిలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం లో వైఎస్ఆర్ పార్టీకి చెందిన 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామానికి చెందిన వైస్సార్సీపీ ముఖ్య నాయకుడు, మాజీ సర్పంచ్ రామస్వామి మరియు ఆయన అనుచరులతో 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ సమక్షంలో సోమవారం తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు అనుచరులు టిడిపిలో చేరిక ముందుగా గ్రామం లో బారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పత్తికొండ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు నేతృత్వంలో 150 కుటుంబాలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలను టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రామస్వామి మాట్లాడుతూ, జగన్ మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పాలన వారి విధానాలు నచ్చక స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికలలో  కేఈ శ్యామ్ కుమార్ అన్న నాయకత్వంలో ఆయన విజయం కోసం పనిచేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ. శ్యాం బాబు అన్నను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author