PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరుద్యోగుల‌కు 20 శాతం డిస్కౌంట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బస్‌ పాస్‌ల్లో టీఎస్ ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మూడు నెలల పాస్‌లపై 20 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూడు నెలల ఆర్డినరీ బస్‌పాస్‌ రూ.3,450 ఉండగా.. 20 శాతం రాయితీ రూ.2800కు పాస్‌లు ఇస్తారు. మెట్రో మూడు నెలల పాస్‌ ప్రస్తుతం రూ.3900. 20 శాతం డిస్కౌంట్‌ అనంతరం రూ.3120. రౌండెడ్‌ ఆఫ్‌తో రూ.3200కు పాస్‌లను పొందవచ్చు. పాస్‌ల కోసం తీసుకొనే గుర్తింపు కార్డుకు రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

                                   

About Author