PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

200 కోట్ల మోసం.. అధికారుల‌కు నెలకు కోటి లంచం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఘ‌రానా మోస‌గాడు సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. 200 కోట్ల మోసం కేసులో అరెస్ట‌యిన సుఖేశ్ ప్ర‌స్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నాడు. రాన్ బాక్సీ కంపెనీ మాజీ ప్ర‌మోట‌ర్లు మ‌ల్వింద‌ర్ సింగ్, శివింద‌ర్ సింగ్ ల‌కు బెయిల్ ఇప్పిస్తాన‌ని చెప్పి వారి భార్య‌ల వ‌ద్ద 200 కోట్లు వ‌సూలు చేసిన కేసులో సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ అరెస్ట్ అయ్యారు. అయితే.. జైలు నుంచి కూడ త‌న నేర సామ్రాజ్యాన్ని న‌డిపిన‌ట్టు ఈడీ విచార‌ణ‌లో వెల్ల‌డైంది. సెల్ ఫోన్ వాడేందుకు.. జైలులో అన్నిర‌కాల సౌక‌ర్యాలు అందించేందుకు జైలు అధికారుల‌కు నెల‌కు కోటి రూపాయ‌లు లంచం ఇచ్చిన‌ట్టు విచార‌ణ‌లో వెల్ల‌డైంది. బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫ‌తేహితో పాటు ప‌లువురు మోడ‌ల్స్ సుఖేశ్ ను క‌లిసేందుకు జైలుకు వ‌చ్చేవార‌ని వార్తాక‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

                   

About Author