ఆర్యూలో.. యోగాపై 4 రోజుల వర్క్ షాప్
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: యోగాంధ్ర – 2025 కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి 20వ తేదీవరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో యోగా గురించి 4 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వైస్ఆఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు తెలిపారు. ఈరోజు ఆయన తన ఛాంబరులో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచరు విడుదల చేసిన.(మనస్సును పదును పెట్టుకోవడం, ఆత్మను బలోపేతం చేసుకోవడం: విద్యానైపుణ్యంకోసం యోగా) అనే అంశంపై రాయలసీమ యూనివర్సిటీ మరియు నంద్యాలకు చెందిన రామా అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ వారి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు.మే 21 నుండి జూన్ 21వ తేదీవరకు కొనసాగనున్న యోగాంధ్ర – 2025 కార్యక్రమాల్లో భాగంగా వర్సిటీ సెంట్రల్ లైబ్రరీవద్ద నిర్వహించిన స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో వైసఛాన్స్లర్ ఆచార్య వి. బసవరావు పాల్గొన్నారు. వర్సటీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్కుమార్ నాయుడు, చీఫ్ వార్డెన్ ఆచార్య ఎన్. నరసింహులు, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు, యోగా కోఆర్డినేటర్ డాక్టర్ బి. కవిత, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. శివకిషోర్ తోపాటు వివిధ శాఖల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.