PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

60 లక్షల తో డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు

1 min read

పల్లెవెలుగు ,వెబ్ చెన్నూరు :మండలంలోని కొండపేట గ్రామపంచాయతీ లో 60 లక్షల రూపాయలతో డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల పనులను సర్పంచి తుంగ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్, జి ఎన్ భాస్కర్ రెడ్డి, ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండపేట గ్రామపంచాయతీకి ఒక ప్రత్యేకత ఉందని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కొండపేట బ్రిడ్జి నిర్మాణానికే కాకుండా పలు అభివృద్ధి పనుల కు కృషి చేయడం జరిగిందన్నారు, నేడు ఆయన బాటలోనే కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు, గ్రామపంచాయతీలో ఎక్కడైతే డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి నేడు ఆ పనులను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ఈ పనులను డి ఎం ఎఫ్ 40 లక్షల నిధుల ద్వారా అదేవిధంగా గడపగడపకు సంబంధించిన నిధులు 20 లక్షలు కలిపి 60 లక్షల రూపాయలతో ఈ పనులను చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు, అనంతరం ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్ ,సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ లు మాట్లాడుతూ మండలంలో కొండపేటకు సంబంధించి, ఇప్పటికే కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు చాలా అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని అందుకే కొండపేట గ్రామపంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా ఇప్పటికే ఎన్నిక కాపడి ఆదర్శ పంచాయతీగా ఉండడం జరిగిందన్నారు, భవిష్యత్తులో ఇంకా మరిన్ని నిధులు తీసుకొని వచ్చి గ్రామ పంచాయతీ నీ అభివృద్ధి పథంలో తీసుకుపోవడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఎంపీటీసీలు దుంప నాగిరెడ్డి, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు నాగిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి( డీలర్) నీలం వెంకటసుబ్బారెడ్డి, సుబ్బారావు, వైఎస్ఆర్సిపి ఎస్టి సెల్ మండల కన్వీనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author