ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7 మంది అరెస్టు..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్. 91 లక్షల నగదు స్వాధీనం, 7 మొబైల్ ఫోన్ లు సీజ్ చేసిన … ఆదోని ఒకటవ పట్టణ పోలీసులు. గత నెలలో జరిగిన జిల్లా ఎస్పీ గారి నేర సమీక్ష సమావేశంలో బాగంగా చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ ను ఆన్ లైన్ లో ఆడుతూ, బెట్టింగ్ కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మరీ, ఆ అప్పులు తీర్చలేకఇంట్లో తల్లితండ్రులకు చెప్పుకోలేక , తమ భవిష్యత్తు పై వారి తల్లి తండ్రులు పెట్టుకున్న ఆశలను అడియశలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుచున్నాయని బెట్టింగ్ ను ఎలాగైనా అరికట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాలు జారీ చేశారుఈ మేరకు, ఆదోని డిఎస్పి M. హేమలత సూచనల మేరకు ఆదోని Iటౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అయిన రామ్ మరియు స్టేషన్ సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 18.05.2025 వ తేదీన సాయంత్రం 03.30 గంటలకు వాల్మీకి నగర్ లోని వాల్మీకి గుడి కి ఎదురుగా మొబైల్ ఫోన్ లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్. ఆర్.నాగరాజును అదుపులోనికి తీసుకోగా మిగిలిన ముద్దాయులు పారిపోయారు అతని నుండీ నగదు 50,000 వేల రూపాయలను స్వాదీన పరచుకుని ఆదోని 1 టౌన్ పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నంబర్ 79/2025 u/s 318(4),61(2),111,112(2) r/w 3 (5) BNS and Sec 9(1) AP Gaming Act (Cricket Betting) కేసు నమోదు చేయడమైనది తదుపరి టెక్నాలజీ ఆధారంగా దొరికిన సమాచారం మేరకు సిఐ రామ్ మరియు సిబ్బంది కలిసి కర్నూలు, హైదరాబాదు, ఒంగోలు,చిలకలూరు పేట, బెంగళూరు సిటిలలో తిరిగిచివరకు 30.05.2025వ తేదీన మద్యాహ్నం 11.30 గంటలకు ఆదోని టౌన్ లోని ఎల్లమ్మ కొండ లోని మర్రి చెట్టు దగ్గర 7 మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి 07 మొబైల్ ఫోన్ లు మరియు నగదు 91,00,000 లక్షల రూపాయలను స్వాదీనపరచుకోవడమైనది.ముద్దాయుల నుంచి స్వాదీనపరచుకున్న వాటి వివరాలు:-1. Rs.91,00,000 లక్షల నగదు. 207 మొబైల్ ఫోన్ లుఅదుపులోనికి తీసుకోబడిన ముద్దాయి ల వివరాలు :-1. మసీదుపుర ఇస్మాయిల్ @ ఇస్మాయిల్, వయసు 44 సం .లు, తండ్రిM. నజీర్ అహమ్మద్, మసీదుపుర, ఆదోని టౌన్ 2. బోయ మహానంది వయసు 55 సం .లు, తండ్రి పేరు Late రామన్న, బోయగేరి, ఆదోని టౌన్3. బోయ రమేశ్, వయసు 26 సం .లు, తండ్రి పేరు బోయ మహానంది, మరాటి వీధి, ఆదోని టౌన్. 4. S. రాజేష్, వయసు 38 సం .లు, తండ్రి పేరు ఎస్. సంజీవ రెడ్డి, గౌరీబిధనూర్, చిక్కబళ్లాపూర్, కర్ణాటక, ప్రస్తుత నివాసము పురువంకర, C block – 302, యలహంక, మదర్ డైరీ, బెంగళూరు సిటి. 5. చుండి శ్రీనివాస రావు @ నాయుడు, వయసు 48 సం .లు, తండ్రి పేరు Late శ్రీరాములు, ఎద్దులూరిపాడు గ్రామము, జరుగుమల్లి మండలం, ఒంగోల్ జిల్లా, ప్రస్తుతం నివాసం మంగమూరు రోడ్, ఒంగోల్ టౌన్. 6. అడ్డాల కల్యాణ్, వయసు 33 సం, తండ్రి పుల్లయ్య, సత్యనారాయణపురం, ఒంగోల్ టౌన్, 7. రఘు ఆచారిఅయిజ, ప్రస్తుతం హైదరాబాద్.ముఖ్య గమనిక…వీరు ఆడుతున్న క్రికెట్ బెట్టింగ్ యాప్స్ 1. నేషనల్ ఎక్సేంజ్ 92. రాధే ఎక్సేంజ్ , 3. వజ్రా ఎక్సేంజ్, 4. నేషనల్ 777, 5. మోర్ ఎక్సేంజ్ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన ఆదోని డిఎస్పీ హేమలత ని , ఆదోని ఒన్ టౌన్ సిఐ శ్రీరామ్ , ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మునిస్వామి, రంగస్వామి, ఏకవీర, ఫక్కీరప్ప, హుస్సేన్ భాషాలను జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ప్రత్యేకంగా అభినందించారు.