PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మన ప్రియతమ నేత రాజీవ్ గాంధీ 79 వ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దివంగత ప్రధాని 79 వ జయంతి సందర్భంగా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం, కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి  అమానుల ఆధ్వర్యంలో మన ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జన్మదినాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయంతిని సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా ఆధ్వర్యంలో 79వ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. సందర్భంగా అమానుల్లా మాట్లాడుతూ ఈరోజు ఇంటర్నెట్ ఉంది అంటే రాజీవ్ గాంధీ ఫలితమే టెలి కమ్యూనికేషన్ ఉంది అంటే రాజీవ్ గాంధీ కృషి వలన మన దేశానికి వచ్చిన అతి పెద్ద వరం లాంటిది అని అమానుల చెప్పడం జరిగింది అదేవిధంగా 2024లో ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే వృద్ధులకు 4,000 ఫించిని నిరుపేదలకు 66 ఆర్థిక సహాయము ఒక ఇంటికి ఇవ్వడం జరుగుతుందని అమానుల్లా చెప్పడం జరిగింది అదే కాకుండా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే రైతులుకు ఆరు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ ఆలూరు నియోజకవర్గం లో పర్యటిచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ పరసప్ప. బండ్రాలు తిమ్మప్ప. బి రాజు. ఎం ఖలీల్. ముస్తఫా. యూసుఫ్. లక్కమ్మ. షేక్ అన్నా. ఎరుకుల బసవరాజా. కోనేరు గోరప్ప మొదలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.

About Author