రాజీవ్ గాంధీ 83వ జయంతి వేడుకలు
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ఏలూరు: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 83వ జయంతి సందర్భంగా ఏలూరు సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బురదగుంట లెవిన్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రోగులను పరామర్శించి, వారికి పండ్లు పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం తమ బాధ్యత అని యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలూరు సిటీ యూత్ కాంగ్రెస్ సభ్యులు కప్పల చిన్నబాబు, వుట్టల సునీల్, ఇసాపురి కిరణ్, బురదగుంట హేమంత్ తదితరులు పాల్గొన్నారు.



